Posts

భరత్ అనే నేను సినిమా మూల కథ అతనిదే

భరత్ అనే నేను సినిమా మూల కథ అతనిదే 29/04/2018,05:22 సా. Admin మూవీ న్యూస్ ‘భరత్ అనే నేను’ సినిమాకి మూల కథ అందించింది శ్రీహరి నాను అని అందరికి తెలిసిన విషయమే. ఇతను డైరెక్టర్ కొరటాల శివకి ఫ్రెండ్. అతను చెప్పిన లైన్ నచ్చడంతో కొరటాల అతని దగ్గర నుండి ఆ లైన్ తీసుకుని మహేష్ బాబు తగ్గట్టు స్క్రిప్ట్ డెవెలప్ చేసాడు. శ్రీహరి నాను అనే వ్యక్తి రెండు మూడు సినిమాలు దర్శకత్వం కూడా చేసాడు. భూమిక హీరోయిన్ గా ‘సత్యభామ’ అనే సినిమా రూపొందించిన దర్శకుడు ఇతనే. ఆ సినిమా అంతగా ఆడలేదు. కానీ శ్రీహరి పనితీరు నచ్చి అతడి దర్శకత్వంలో భూమిక ‘తకిట తకిట’ అనే సినిమా కూడా నిర్మించింది. అది కూడా అంతగా ఆడలేదు. ఆ తర్వాత అతను కొన్ని సినిమాలకి రైటర్ గా పని చేసాడు. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. మళ్లీ ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత అతడి పేరు వార్తల్లోకి వచ్చింది. నిన్న జరిగిన భరత్ అనే నేను సక్సెస్ సెలెబ్రేషన్స్ డైరెక్టర్ కొరటాల మాట్లాడుతూ… తెలుగు పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ రచయితల్లో శ్రీహరి నాను ఒకడని కొరటాల కితాబిచ్చాడు. అతను ఏ కథ రాసుకున్న మహేష్ బాబుని ద్రుష్టిలో పెట్టుకునే కథ రాస్తాడని… అలాంటి గొప్ప నటుడి కోసం కథ అంటే ఇన్‌స...

అరుణాచలం

అరుణాచలం మేడిన్ అమెరికా! Created: May 31, 2015, 01:01 IST | Updated: May 30, 2015, 23:51 IST ఆ సీన్ - ఈ సీన్ జార్జ్‌బార్ మెక్‌కుచ్చన్ అనే అమెరికన్ రచయిత ‘బ్రెస్టర్ మిలియన్స్’ నవలను 1902లో రాశాడు. హాలీవుడ్‌లో ఈ నవల ఆధారంగా ఆరు సినిమాలు వచ్చాయి. మన దగ్గర మూడు వచ్చాయి. హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలో ఎన్టీ రామారావు హీరోగా ‘వద్దంటే డబ్బు’ సినిమాకు మూల కథను ‘బ్రెస్టర్ మిలియన్స్’ కథాగమనాన్ని అనుసరించి సంగ్రహించారు. 1988లో బాలీవుడ్‌లో నిసీరుద్దీన్ షా ప్రధానపాత్రలో ‘మాలామాల్’ రూపొందింది. జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా ‘బాబాయ్ అబ్బాయ్’లోనూ ఈ ఛాయలు కనిపిస్తాయి. అయితే మెక్ నవల, 1985లో వచ్చిన ‘బ్రెస్టర్ మిలియన్స్’ సినిమాల జాడ ఎక్కువగా కనిపించేది మాత్రం ‘అరుణాచలం’ సినిమాలో మాత్రమే. సినీ సృజనలో కాపీ అనేది చాలా సహజమైన ప్రక్రియ. అయితే కాపీ చేసినప్పుడు అసలైన సృజనకారులకు క్రెడిట్ ఇస్తే... కాపీ కొట్టిన వాళ్లు కూడా గొప్పవాళ్లే అవుతారు. భారతీయ కాపీ రాయుళ్లలో ఇలాంటి స్పృహ కనిపించదు. కానీ, ప్రేక్షకులు మాత్రం స్పృహలోనే ఉంటారు. కాపీ కథల జాడను పట్టేస్తారు. ఈ అరుణాచలం కూడా అంతే. అడ్డపంచెలో వచ్చి పలకర...

అధిక బ‌రువు త‌గ్గాలా..? వీటిని రోజూ తినండి..!

అధిక బ‌రువు త‌గ్గాలా..? వీటిని రోజూ తినండి..! అధిక బ‌రువుతో నానా అవ‌స్థ‌లు ప‌డుతూ రోజూ వ్యాయామం చేయ‌డం, తిండి త‌గ్గించ‌డం వంటి ప‌ద్ధ‌తుల‌ను చాలా మంది ఫాలో అవుతున్నారు. ఈ క్ర‌మంలో ఒక్కోసారి ఆహారం విష‌యంలో క‌ఠిన నియ‌మాల‌ను పాటిస్తున్నారు. అయితే దీనికితోడు కింద ఇచ్చిన ప‌లు ఆహార ప‌దార్థాల‌ను కూడా నిత్యం తింటుంటే దాంతో ఒంట్లో ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది. త‌ద్వారా అధిక బ‌రువు త‌గ్గుతారు. పొట్ట కూడా క‌రిగిపోతుంది. మ‌రి ఆ ఆహార ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! బాదం ప‌ప్పు బాదం ప‌ప్పులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే విట‌మిన్ ఇ అధిక బ‌రువును త‌గ్గించేందుకు ప‌నికొస్తుంది. నిత్యం గుప్పెడు బాదం ప‌ప్పును నీటిలో నాన‌బెట్టి తింటే ఫ‌లితం ఉంటుంది. చిరుధాన్యాలు శరీరంలో కొవ్వును వేగవంతంగా కరిగించడంలో చిరుధాన్యాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగులు, స‌జ్జ‌లు, జొన్న‌లు వంటివి ఈ కోవ‌కు చెందుతాయి. కొబ్బరి నూనె కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించ‌డంలో శక్తివంతంగా పని చేస్తుంది. దీంట్లో ఉండే పోషకాలు శ‌రీర‌ జీవక్ర...

మీల్‌కి ఫేక్‌ రీప్లేస్‌మెంట్‌? షేక్స్‌, సూప్స్‌ వృధా : డైటీషియన్లు

27-07-2017 13:41:46 •అసోచామ్‌ అధ్యయనంలో వెల్లడి •షేక్స్‌, సూప్స్‌ వృధా : డైటీషియన్లు •డైట్‌లో ప్రొటీన్‌, కార్బో,హెల్తీ ఫ్యాట్‌ ఉండాలి •మీల్‌ రీప్లేస్‌మెంట్‌కు నగరవాసులు మొగ్గు సిటీ బిజీ లైఫ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ చేస్తే చాలనుకునుకుంటారు కొందరు. మరికొందరు ఏదో ఒకటి టైమ్‌కి అనే టైప్‌. లేటె్‌స్టగా ఆరోగ్యం కోసమంటూ మీల్‌ సప్లిమెంట్స్‌ తీసుకుంటున్నారు మరికొందరు. మధుమేహులు, ఊబకాయులకు ఆరోగ్యం కోసమంటూ రూపొందించిన ప్రొటీన్‌ షేక్స్‌, ఫుడ్‌ సప్లిమెంట్స్‌ని ఆవర్గాలకు చెందనివారు వాడేస్తున్నారు. అయితే డైటరీ లేదంటే మీల్‌ సప్లిమెంట్స్‌ను డాక్టర్‌ల సూచన మేరకు తీసుకోవాలి. ఎలా పడితే అలా వాడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు డైటీషియన్లు. ఇక అసోచామ్‌-ఆర్‌ఎన్‌సీఓఎస్‌ సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60-70 శాతం డైటరీ సప్లిమెంట్స్‌ మోసపూరితమైనవి అని తేల్చి చెప్పింది. అయినప్పటికీ రోజుకో కొత్తరకం డైట్‌ రీప్లే్‌సమెంట్‌ వస్తూనే ఉంది. మార్కెట్‌ రెండింతలు.. ఓ అంచనా ప్రకారం ఇండియాలో డైటరీ సప్లిమెంట్‌ మార్కెట్‌ 2015లో 13...

వంటింట ఆరోగ్యాల పంట

వంటింట ఆరోగ్యాల పంట ఆహారమే ఆరోగ్యం... ఆరోగ్యమే జీవన సౌభాగ్యం...ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి అందరికీ తెలిసిందే. ఆ మహాభాగ్యాన్ని దక్కించుకోవడానికి కావలసినవి అషై్టశ్వర్యాలు కాదు... పోషక విలువలు గల చక్కని సమతుల ఆహారం, మంచి జీవనశైలి...ఇవి ఉంటే చాలు... నిక్షేపంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఇంటింటా... వంటింట ఆరోగ్యాల పంట పండించుకోవచ్చు.నిత్యం మనం వాడుకునే ఆహార పదార్థాలు, వాటి పోషక విలువలను మీ ముందు ఉంచుతున్నాం.వీటిలో తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు మొదలుకొని వంటింటి మూలికల వరకు ఉన్నాయి.స్థలాభావం వల్ల అన్నింటికీ చోటు కల్పించలేకపోతున్నా, రోజువారీ వాడుకలో ఉన్న వీలైనన్ని పదార్థాల గురించిన సమాచారాన్ని ఈ ప్రత్యేక సంచికలో అందిస్తున్నాం. బియ్యం ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడే ధాన్యాలలో వరి ప్రధానమైనది. వరి నుంచి వచ్చే బియ్యంతో వండే అన్నం మన భారతీయులు ఎక్కువగా వినియోగిస్తారు. బియ్యంతో తయారు చేసే రకరకాల పదార్థాలను, వంటకాలను చైనా, జపాన్‌ వంటి తూర్పు దేశాల ప్రజలు విరివిగా వినియోగిస్తారు. ఏ రూపంలో వినియోగించినా, పిండి పదార్థాలు పుష్కలంగా ఉండే బియ్యం తక్షణ శక్తి ఇస్తుంది. పాలిష్‌ చేయని దంప...

సామల జావ

ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని పలు దేశాల్లో జొన్నలు విరివిగా పండుతాయి. గ్లూటెన్‌ రహిత చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా విరివిగా వాడుకలో ఉన్నాయి. జొన్న రొట్టెలు, జొన్న అంబలి వంటివి మన దేశంలో విరివిగా వాడుకలో ఉన్నాయి. విదేశాల్లో బ్రెడ్, బిస్కట్లు వంటి వాటి తయారీలో జొన్నలను ఎక్కువగా వాడతారు. గ్లూటెన్‌ సరిపడని వారికి జొన్నలు కూడా మంచి ప్రత్యామ్నాయం.జొన్నలలో రెండు రకాలున్నవి. పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలు. పచ్చ జొన్నలు చిరిచేదుగా ఉండి ఆరోగ్యానికి మంచివంటారు. తెల్లజొన్నలు కొద్దిగా తియ్యదనం కలిగి ఉంటాయి. జొన్న రవ్వతో ఇడ్లీలు, ఉప్మా చేసుకోవచ్చు. జొన్నపిండితో రొట్టెలు తయారు చేసుకుంటారు. తెలంగాణా, కర్నూలు ప్రాంతాలలో వీటి వాడకం ఎక్కువ. పోషకాలు: జొన్నల్లో పిండి పదార్థాలు, చక్కెరలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్‌ బి1, బి2, బి3, బి5 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటంతో జొన్నలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. శరీరంలో చెడుకొవ్వును నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని, ఎముకల దారుఢ్య...

ఎలాంటి ఆమ్లగుణం లేని చిరుధాన్యాలు ఎసిడిటీతో బాధపడేవాళ్లకి ఎంతో మేలు.

Millets and health - చిరుధాన్యాలు.ఆరోగ్యము ,తృణధాన్యాలు.ఆరోగ్యము,మిల్లెట్స్‌.ఆరోగ్యము • • పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు... ఇవన్నీ చిరు/తృణధాన్యాలే. వీటన్నింటినీ కలిపి ఇంగ్లిష్‌లో మిల్లెట...